English | Telugu

బాహుబ‌లి ఫ్లాప్ అట‌.. నిప్పులుగ‌క్కిన జ‌ర్న‌లిస్ట్‌

యు ఏ ఈ సెన్సార్ బోర్డు స‌భ్యురాలిగా ఉంటూ, ఎన్నో సినిమాల‌కు రివ్యూలు రాసి, నికార్స‌యిన ఫ‌లితాల్ని ముందే బ‌య‌ట‌పెట్టిన కైర సంధు అనే ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టు బాహుబ‌లికి అప్పుడే రివ్యూ, రేటింగ్ రెండూ ఇచ్చేసింది. ఐదు స్టార్ల‌కు రెండే స్టార్లు ఇచ్చిన కైరా... ఈ సినిమాని చీల్చిచండాడింది. రానా, ప్ర‌భాస్‌ల‌కు చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, ప‌వ‌న్‌ల‌కు ఉన్నంత స్టామినా లేద‌ని, బాహుబ‌లి ఇండియ‌న్ బిగ్గెస్ట్ మోష‌న్ పిక్చ‌ర్ అంటూ బిల్డ‌ప్పులిచ్చార‌ని, ఆడియ‌న్స్‌కి ఫూల్స్ చేశార‌ని, ఈ సినిమాలో కంటెంట్ లేద‌ని, ఇది బంగారం కాద‌ని, కేవ‌లం రోల్డ్ గోల్డ‌ని.. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో చెడామ‌డా చివాట్లు వేశారు. యు ఏ ఈలో ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు త‌ల‌లు ప‌ట్టుకొన్నార‌ని, ఈ సినిమా చూసి టైమ్‌, టికెట్స్ రెండూ వేస్ట్ చేసుకోవ‌ద్ద‌ని ట్విట్టారు. కాని ... ఈ విశ్లేష‌ణ‌లు అబద్దం కావాల‌ని, బాహుబ‌లి నిజంగానే ఇండియ‌న్ రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లుకొట్టాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకొందాం. ఎందుకంటే.. మ‌న తెలుగు సినిమా. మ‌న‌మంతా గ‌ర్వించే గొప్ప సినిమా. నిజ‌మైన తీర్పు కోసం రేప‌టి వ‌ర‌కూ ఎదురుచూద్దాం. జై.. బాహుబ‌లి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.