English | Telugu

'బాహుబలి' ఫస్ట్ టాక్: రాజమౌళి మ్యాజిక్

ప్రేక్షకజనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ చిత్రం సమయం రానే వచ్చింది. బాహుబలి సినిమా ఎలా వుంటుంది? ఈ సినిమా అందరి అంచనాలను అందుకుంటుందా? రాజమౌళి ఎప్పటిలాగే తన కథ కథనాలతో మాయ చేస్తాడా? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం దొరికింది. బాహుబలి ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది. ముంబైలో బాహుబలి ఫస్ట్ షో చూసిన బాలీవుడ్ ఫేమస్ మూవీ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ బహుబలిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

రాజమౌళి బహుబలితో ఇండియన్ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడని, బాహుబలి ఇండియన్ సినిమా తెరపై ఓ అద్భుతమని అన్నాడు. బాహుబలి లో సెట్స్ , గ్రాఫిక్స్, మ్యూజిక్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే అన్నీ సూపర్బ్ గా వున్నాయని అన్నాడు. ముఖ్యంగా బాహుబలి లి ముఖ్యపాత్రలను పోషించిన ప్రభాస్, రానాలు ఇరగదీసారని చెప్పాడు. రాజమౌళి లాంటి దర్శకుడిని తానెప్పుడు చూడలేదని తరన్ ఆదర్శ్ ట్విట్టర్ లో పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ ఒక్క ట్విట్ తో బాహుబలి ఎలా వుంటుందన్న సందేహం అందరిలో తీరిపోయినట్టే!!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.