English | Telugu

రంగంలోకి దిగనున్న పవన్ రెండో మరదలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా "అత్తారింటికి దారేది" కోసం అభిమానులతో పాటు ఏంటో ఆతృతగా ఎదురుచూస్తుంది హీరోయిన్ ప్రణీత. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమానికి రావాలనుకొని, రాలేకపోయి చాలా బాధపడింది. అయితే కనీసం సినిమా ప్రమోషన్స్ లో అయిన పాల్గొని, కాస్త పబ్లిసిటీ పెంచుకుందామని భావించిన ప్రణీతకు సమైఖ్యాంద్ర ఉద్యమం వలన నిరాశే మిగిలింది. అయితే ప్రస్తుతం రిలీజ్ డేట్ పక్కగా ఫిక్స్ అవడంతో ఎలాగైనా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని, తెలుగు సినీ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు వచ్చేలా ప్రయత్నాలు చేస్తుందట.

అసలే ఈ చిత్రంలో వీళ్ళిద్దరూ కూడా పవన్ కు మరదళ్ళుగా నటించారు. అటు ఈ సినిమాలోను, ఇటు బయట కూడా సమంత వలన తనకు సరైన గుర్తింపు రావట్లేదని వాపోతుందట. మరి విడుదలకు సిద్దంగా ఉన్న "అత్తారింటికి దారేది" చిత్రం కోసం ప్రణీత ఏం చేయనుందో త్వరలోనే తెలియనుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.