English | Telugu

స‌మంత‌తో విజ‌య్ కెమిస్ట్రీ మాములుగా లేద‌స‌లు.. 'ఖుషి' సెకండ్ సింగిల్ 'ఆరాధ్య' రివ్యూ

"నా రోజా నువ్వే.." అంటూ రెండు నెల‌ల క్రితం ఫ‌స్ట్ సింగిల్ తో మ్యూజిక్ ల‌వ‌ర్స్ ని ఫుల్ ఖుష్ చేసేసిన 'ఖుషి' టీమ్.. ఇప్పుడు 'ఆరాధ్య' అంటూ సెకండ్ సింగిల్ తో ప‌ల‌క‌రించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సమంత‌పై చిత్రీక‌రించిన ఈ పాట కూడా మెలోడీయ‌స్ గా సాగింది. చిత్ర ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ సాహిత్య‌మందించిన ఈ గీతానికి హేష‌మ్ అబ్దుల్ వ‌హ‌బ్ అందించిన బాణీ ఎంతో విన‌సొంపుగా ఉంది. ఇక సిద్ శ్రీ‌రామ్, చిన్మ‌యి గాత్రాలైతే పాట‌ని మ‌రో స్థాయికి తీసుకెళ్ళాయి. లిరిక‌ల్ వీడియోని బ‌ట్టి చూస్తే.. స‌మంత‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ కెమిస్ట్రీ మాములుగా లేద‌నే చెప్పాలి.

"ఆరాధ్య నా ఆరాధ్య‌.. నువ్వేలేనిదేది వ‌ద్దు ఆరాధ్య" అంటూ సాగే ఈ పాట‌లో "నా గుండెను మొత్తం తవ్వి త‌వ్వి చంద‌న‌మంతా చ‌ల్ల‌గా దోచావే" వంటి వాక్యాలు భ‌లేగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఓవ‌రాల్ గా.. 'ఖుషి" నుంచి వ‌చ్చిన తొలి రెండు గీతాలు కూడా చార్ట్ బ‌స్ట‌ర్స్ అనే చెప్పొచ్చు. మ‌రి.. మ్యూజిక‌ల్ గా మెస్మ‌రైజ్ చేస్తున్న 'ఖుషి' నుంచి త‌దుప‌రి రాబోయే పాట‌లు కూడా ఇదే స్థాయిలో ఆక‌ట్టుకుంటాయేమో చూడాలి.

మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై త‌యార‌వుతున్న 'ఖుషి'.. సెప్టెంబ‌ర్ 1న థియేట‌ర్స్ లోకి రానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.