English | Telugu

సినిమా సెట్స్ లో సేఫ్టీ గురించి మాట్లాడిన రెహ‌మాన్‌

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.రెహ‌మాన్ కుమారుడు ఎ.ఆర్‌.అమీన్‌ ఇటీవ‌ల ఓ షూటింగ్ సెట్లో జ‌రిగిన ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదం గురించి స్పందించారు ఎ.ఆర్‌.రెహమాన్‌. ఇండియ‌న్ ఫిల్మ్ సెట్స్ లో వ‌ర‌ల్డ్ క్లాస్ సేఫ్టీ ఉండాల‌ని అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ ``కొన్నాళ్ల క్రితం నా కుమారుడు అమీన్‌, అత‌ని స్టైలింగ్ టీమ్ పెద్ద ప్ర‌మాదం నుంచి దేవుడి ద‌య‌వ‌ల్ల బ‌య‌ట‌ప‌డ్డారు. ముంబై ఫిల్మ్ సిటీలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. మ‌న సినిమాలు అంత‌ర్జాతీయ దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఈ క్ర‌మంలో మ‌నం ప్ర‌పంచ‌స్థాయి భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను పాటించాలి. ప్ర‌తి సినిమా సెట్లోనూ అవి ఉండాలి. మా అబ్బాయి షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలియ‌గానే మేం వ‌ణికి పోయాం. అస‌లు అలా ఎందుకు జ‌రిగిందో ఇన్వెస్టిగేష‌న్ చేస్తున్నారు. ఇన్‌స్యూరెన్స్ కంపెనీ కూడా ఆరా తీస్తోంది`` అని అన్నారు.

అమీన్ ఓ ప్రైవేట్ వీడియో సాంగ్ చిత్రీక‌రిస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. పైన క‌ట్టిన షాండ్లియ‌ర్స్ ఉన్న‌ప‌ళాన కుప్ప‌కూల‌డంతో పెద్ద ప్ర‌మాదం చోటుచేసుకుంది. అయితే దాని కింద ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు. ఈ విష‌యాన్ని అమీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఓ కాద‌ల్ క‌ణ్మ‌ణి సినిమాతో సింగ‌ర్‌గా ఇంట్ర‌డ్యూస్ అయ్యారు అమీన్‌. మ్యూజిక్‌లో తండ్రిని మించిన త‌న‌యుడిగా పేరు తెచ్చుకోవాల‌న్న ఆశ‌యంతో కృషి చేస్తున్నాన‌ని ఇంత‌కు మునుపు చాలా సార్లు చెప్పారు ఎ.ఆర్‌. అమీన్‌. ఎక్కువ‌గా హిందీ ప్రొడ‌క్ష‌న్ హౌసుల‌తో టై అప్ అయి, సింగిల్స్, ప్రైవేట్ సాంగ్స్,జింగిల్స్ చేస్తున్నారు ఎ.ఆర్‌. అమీన్‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.