English | Telugu

రుద్రమదేవి రాజ్యప్రవేశం ఎప్పుడు?

దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే స్థాయిలో గుణశేఖర్ సినిమా షూటింగ్ ఉంటుంది....ఒక్కరూపాయి కూడా వెనక్కు తీయకుండా ఖర్చుపెడతాడు. ఆ హంగులు ఆర్భాటాలు చూసి వామ్మో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనిపిస్తుంది. అప్పుడప్పుడు అంచనాలను మించి ఉంటుంది లెండి. ఒక్కమాటలో చెప్పాలంటే ఓ నాలుగు సినిమాలు ఫ్లాప్ అయితే తప్ప ఓ సినిమా హిట్టుకొట్టదన్నమాట. ఈ కోవకు చెందినవే చూడాలనిఉంది, ఒక్కడు. ఒక్కడు తర్వాత మళ్లీ నాలుగు సినిమాలు ఫ్లాప్. దీంతో రుద్రమదేవిపై భారీ ఆశలు పెట్టుకున్నీడీ దర్శకుడు. కానీ ప్రచారం చూస్తుంటేనే ఎక్కడో తేడా కొడుతోందంటున్నారంతా. సినిమా మొదలెట్టినప్పుడు మేకింగ్ వీడియోతో రచ్చరచ్చ చేశాడు. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ బ్రేక్ తీసుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులని, బయ్యర్లు రాలేదని ఏవేవో చెప్పాడు. వీటిన్నింటికీ ఫుల్ స్టాప పెడుతూ...బన్నీని రంగంలోకి దించాడు. ట్రైలర్ లాంచ్ చేశాడు. ముద్దుగుమ్మలతో సయ్యాట లాడించాడు. అదిరిపోయే స్థాయిలో ఆడియో రిలీజ్ చేశాడు. ఇంకేముంది బొమ్మ పడుద్ది అనుకుంటే.....మళ్లీ సైలెంటైపోయాడు. మామూలుగా అయితే ఏప్రిల్ 24న రీలజ్ అన్నాడు. కానీ గుణ తీరుచూస్తుంటే సినిమా అనుకున్న రోజు విడుదలయ్యేట్టు కనిపించడం లేదు. దీంతో అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగలేదో? బాహుబలిలా వాయిదా వేసుకున్నాడో అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంతకీ రుద్రమదేవి రాజ్య ప్రవేశం ఎప్పుడో చూద్దాం!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.