English | Telugu

కన్నడ నుంచి మరో 'కాంతార'!

'కేజీఎఫ్'తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన కన్నడ చిత్రసీమ 'కాంతార'తో తన ప్రతిష్టను మరింత పెంచుకుంది. కన్నడనాట తాజాగా ఈ కోవలో మరో చిత్రం చేరింది. 'కలివీర' పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా 'కలివీరుడు' పేరుతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని.. మినిమం గ్యారంటీ మూవీస్ పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. అవి దర్శకత్వంలో రియల్ ఫైట్స్ కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో చిరాశ్రీ హీరోయిన్. డేని కుట్టప్ప, తబలా నాని, అనితాభట్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జులై ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత అచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. 'కాంతార' కోవలో 'కలివీరుడు' తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అచ్చిబాబు నమ్మకం వ్యక్తం చేశారు. రాఘవేంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా హలేష్ ఎస్, ఎడిటర్ గా ఎ.ఆర్.కృష్ణ వ్యవహరించారు.

కన్నడ సినిమాలు 'కేజీఎఫ్', 'కాంతార' తెలుగునాట ఎంతటి విజయాలు సాధించాయో తెలిసిందే. వాటి బాటలోనే 'కలివీరుడు' పయనిస్తుందేమో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.