English | Telugu

పవర్ స్టార్ 'ఓజీ'లో 'పొగరు' భామ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెట్స్ నుంచి విడుదలైన పవన్ పిక్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలోని ముఖ్య పాత్రల కోసం ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపుతున్నారు.

'ఓజీ'లో అర్జున్ దాస్ నటిసున్నట్లు ఇటీవల ప్రకటించిన మేకర్స్.. తాజాగా నటి శ్రియా రెడ్డి కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమవుతున్నట్లు అనౌన్స్ చేశారు. విలక్షణ నటనతో తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 'అప్పుడప్పుడు', 'అమ్మ చెప్పింది' వంటి సినిమాల్లో నటించింది. అలాగే విశాల్ 'పొగరు' సినిమాలో ఆమె పోషించిన నెగటివ్ రోల్ కి మంచి పేరొచ్చింది. ఇప్పటికే ఆమె ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'సలార్'లో నటిస్తోంది. ఇప్పుడు 'ఓజీ' రూపంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కించుకుంది. స్క్రిప్ట్ చదివిన ఐదు నిమిషాలకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు శ్రియా రెడ్డి తెలిపింది. అది ఆ పాత్ర పవర్ అని, దర్శకుడు సుజీత్ మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ రాశారని, సినిమా అంచనాలకు మించి ఉంటుందని పేర్కొంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.