English | Telugu

వెంకీ సరసన అంజలి

వెంకీ సరసన అంజలి హీరోయిన్ గా నటించనుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, విక్టరీ వెకటేష్ , ప్రిన్స్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తూండగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు". ఈ చిత్రంలో హీరో వెంకటేష్ సరసన హీరోయిన్ గా అంజలి నటించనుంది.

ఈ అంజలి తమిళంలో వచ్చిన "ఎంగేయం ఎప్పోదుం" (తెలుగులో "జర్నీ") చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇక ప్రిన్స్ మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. మహేష్ బాబు, సమంత కలసి నటించిన "దూకుడు" సూపర్ డూపర్ హిట్టయిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. మరి ఈ "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు" ఇంకెంత పెద్ద హిట్టవుతుందో వేచి చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.