English | Telugu

'ఆంధ్ర కింగ్ తాలూకా' బిజినెస్.. హిట్ కొట్టాలంటే అన్ని కోట్లు రావాల్సిందే!

'ఆంధ్ర కింగ్ తాలూకా' థియేట్రికల్ బిజినెస్
రామ్ గత మూడు సినిమాల కంటే తక్కువే
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..?

మాస్ జపం చేసి, గత మూడు సినిమాలతో నిరాశపరిచిన హీరో రామ్ పోతినేని.. ఇప్పుడు రూట్ మార్చి, 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. ఎన్ని కోట్ల షేర్ రాబట్టాలో తెలుసా? (Andhra King Taluka)

'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.22 కోట్ల బిజినెస్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ.9 కోట్లు, సీడెడ్ లో రూ.3 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.2 కోట్లు, ఓవర్సీస్ లో రూ.3.10 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.27.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. రూ.28 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది.

Also Read: 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ రివ్యూ!

రామ్ గత మూడు సినిమాలు యావరేజ్ గా రూ.43 కోట్ల బిజినెస్ చేశాయి. వాటితో పోలిస్తే 'ఆంధ్ర కింగ్ తాలూకా' బిజినెస్ తక్కువే. అయితే ప్రస్తుతం రామ్ ట్రాక్ రికార్డు, ఈ సినిమా జానర్ ని బట్టి చూస్తే.. ఇది మంచి బిజినెస్ చేసినట్టే లెక్క.

అభిమాని బయోపిక్ గా, ప్రతి హీరో అభిమానికి కనెక్ట్ అయ్యే స్టోరీతో వస్తుంది కనుక.. పాజిటివ్ టాక్ వస్తే 'ఆంధ్ర కింగ్ తాలూకా' రూ.28 కోట్ల షేర్ రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు. మరి ఈ సినిమాతో రామ్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.