English | Telugu

ఎక్స్‌పోజింగ్ చేయ‌టం తేలిక కాదు: అన‌సూయ

బుల్లి తెర‌పై యాంక‌రింగ్‌, స్పెష‌ల్ షోస్ అంటూ ఓ రేంజ్‌లో దుమ్ము దులిపి గ్లామ‌ర్ రంగులు అద్దిన అన‌సూయ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై బిజీగా ఉంటున్నారు. రంగ‌స్థ‌లం, పుష్ప ది రైజ్ నుంచి రీసెంట్‌గా వ‌చ్చిన పెద‌కాపు వ‌ర‌కు ప‌లు చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పించారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అన‌సూయ త‌న అభిమానులు, నెటిజ‌న్స్ వేసే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌లిస్తుంటారు. ఒక్కోసారి అవి కాంట్ర‌వ‌ర్సీల‌కు కూడా దారి తీస్తుంటాయి. అయినా కూడా అన‌సూయ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్‌తో ఎప్పుడూ ట‌చ్‌లో ఉండ‌టానికే ప్ర‌య‌త్నిస్తుంటుంది.

తాజాగా మ‌రోసారి అన‌సూయ నెటిజ‌న్స్ కామెంట్స్‌కు రియాక్ట్ అయ్యింది. అదే ఇప్పుడు న్యూస్‌గా వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అన‌సూయ దేని కోసం మ‌ళ్లీ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచార‌నే వివ‌రాల్లోకి వెళితే, ఓ ప్ర‌ముక ఛానెల్‌లో ప్రోగ్రాం కోసం అల‌నాటి తార‌లు సావిత్రి, జ‌మున‌, శ్రీదేవి, సౌంద‌ర్య వంటి న‌టించిన చిత్రాల్లోని కొన్ని పాట‌ల‌ను రీ క్రియేట్ చేయ‌గా అందులో అన‌సూయ ఆయా హీరోయిన్ పాత్ర‌లో క‌నిపించింది. దానికి సంబంధించిన ఫొటోల‌ను ఆమె త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నా పెర్ఫామెన్స్‌తో అల‌నాటి తార‌ల‌కు నివాళి ఇచ్చే అవ‌కాశం రావ‌టం నా అదృష్టంగా భావిస్తున్నాను అని కామెంట్ కూడా పోస్ట్ చేశారు. దీనిపై నెటిజ‌న్స్ కొంద‌రు రియాక్ట్ అయ్యారు.

అయితే ఓ నెటిజ‌న్ మాత్రం ఎక్స్‌పోజింగ్ చేసినంత తేలిక కాదు, సావిత్రిలా న‌టించటం అంటూ కామెంట్ పెట్టాడు. దానికి అన‌సూయ కూడా అదే స్టైల్లో రియాక్ట్ అయ్యింది. ‘‘సావిత్రమ్మ‌లా చేయ‌టం ఎవిరి త‌రం కాదు, నేను వారికి నివాళి ఇచ్చానంతే. అలాగే ఎక్స్‌పోజింగ్ చేయ‌టం అంత తేలికేం కాదు. శారీర‌కంగా, మాన‌సికంగా ఎంతో స‌న్న‌ద్ధం కావాలి. ఏ పాత్ర చేసినా, ఏ డ్రెస్ వేసినా మ‌న ప‌నిని ధృడ సంక‌ల్పంతో చేయాలి’’ అన్నారు అనసూయ.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.