English | Telugu

అల్లు అర్జున్ ప్రారంభించనున్న విమాక్స్ మల్టీప్లెక్స్

అల్లు అర్జున్ ప్రారంభించనున్న విమాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్. వివరాల్లోకి వెళితే యువ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా వైజాగ్ అంటే విశాఖపట్టణంలో "విమాక్స్ మల్టిప్లెక్స్" థియేటర్ జూన్ పదవ తేదీన ప్రారంభించబడుతుంది. ఆ థియేటర్లో తొలి చిత్రంగా జూన్ పదవ తేదీన విడుదల కాబోతూన్న "బద్రినాథ్" రిలీజవుతుంది. అదే కాకుండా ఆ రోజు భీమవరంలో నిర్మించబడిన కొత్త మల్టిప్లెక్స్ థియెటర్ "గీతా మల్టీప్లెక్స్" థియేటర్ ను కూడా అల్లు అర్జున్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు.

దీన్లో కూడా "బద్రీనాథ" సినిమానే తొలి చిత్రం కావటం విశేషం. విమాక్స్ థియేటర్ "బద్రినాథ్" చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్ కట్టించారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ థియేటర్ల ప్రారంభోత్సవానికి కీరవాణి, వినాయక్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ తదితరులు వెళ్ళనున్నారని తెలిసింది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.