English | Telugu

'పుష్ప-2'కి బ్రేక్ ఇచ్చి ఢిల్లీ వెళ్ళిన బన్నీ.. ఎందుకో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప: ది రైజ్' పాన్ ఇండియా రేంజ్ లో ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు వీరి కలయికలో పుష్ప రెండో భాగంగా 'పుష్ప: ది రూల్' తెరకెక్కుతోంది. దీనిపై నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కి బన్నీ చిన్న బ్రేక్ ఇచ్చాడు. బన్నీ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడానికి కారణం 'పుష్ప-1' కావడం విశేషం.

'పుష్ప-1'లో పుష్పరాజ్ గా బన్నీ నటనకు అందరూ ఫిదా అయ్యారు. అంతేకాదు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రేపు(అక్టోబర్ 17న) ఢిల్లీలో జరగనుంది. ఈ వేడుక కోసమే తాజాగా బన్నీ తన సతీమణి స్నేహ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్ళారు. బన్నీ ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లో తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జాతీయ ఉత్తమ నటుడిగా రేపు అవార్డు అందుకోనున్న బన్నీ.. తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చి మళ్ళీ పుష్ప-2 షూటింగ్ తో బిజీ కానున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.