English | Telugu

అమెరికాలో గుర్రం పరుగే పరుగు

అల్లు అర్జున్, శృతిహాసన్ కలిసి నటించిన తాజా చిత్రం "రేసుగుర్రం". ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఇప్పటికే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం ఓవర్ సీస్ లో కూడా తన హవా కొనసాగిస్తుంది. ఈ సినిమా ఒక్క అమెరికాలోనే అన్ని థియేటర్లలో కలిపి 3,13,000 డాలర్లు (1,88,00,000రూపాయలు) వసులు చేసింది. ఇది బన్నీ కెరీర్ లో హయ్యెస్ట్ గా ఉందని, ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉన్నాయని ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లో విడుదల చేసిన ఫికప్ సంస్థ ఈ విషయాన్నీ వెల్లడించింది. తెలుగుతో పాటు మలయాళంలో కూడా మంచి వసూళ్లను రాబడుతూ విజయ పథంలో దూసుకుపోతుంది.

బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా. కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.