English | Telugu

మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్‌... వైరల్‌ అవుతున్న ఫోటో!

అల్లు అర్జున్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘పుష్ప2’ కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తూ, కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లో రూ.829 కోట్లు కలెక్ట్‌ చేసి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు తీస్తోంది. పెంచిన టికెట్‌ ధరలకు భయపడి కొందరు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇది గమనించిన మేకర్స్‌ సోమవారం నుంచి టికెట్‌ ధరలను బాగా తగ్గించారు. గత నాలుగు రోజులుగా కొన్నిచోట్ల ఖాళీగా ఉన్న థియేటర్లు ఇప్పుడు పుంజుకుంటున్నాయి. దీన్నిబట్టి పుష్పరాజ్‌ తన టార్గెట్‌ను ఈజీగానే రీచ్‌ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కి మధ్య కోల్డ్‌ వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. రోజు రోజుకీ మెగా ప్యామిలీకి, బన్నికి మధ్య దూరం పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ ఫోటో హల్‌చల్‌ చేస్తోంది. మెగాస్టార్‌ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్‌.. చిరంజీవి, సురేఖతో కలిసి దిగిన ఫోటో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పుష్ప2 సక్సెస్‌ తర్వాత మెగాస్టార్‌ని అల్లు అర్జున్‌ కలిసిన ఫోటోయేనా ఇది? అనే ఆలోచనలో పడ్డారు. నిజానికి ఇది ఇప్పటి ఫోటో కాదు. పుష్ప చిత్రానికి అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు వచ్చినపుడు తన భార్య సురేఖతో కలిసి వెళ్ళి బన్నీని అభినందించారు చిరు. అప్పటి ఫోటోను ఇప్పుడు వైరల్‌ చేస్తున్నారు అభిమానులు. అదీ విషయం.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.