English | Telugu

కేజిఎఫ్ యష్  గురించి ఎవరికి తెలుసంటున్న అల్లు  అరవింద్! 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న ఎన్నో ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ కూడా ఒకటి. గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ ని చూసి సినిమాకి వెళ్లే ప్రేక్షకులు కోకొల్లలు. ఆ సంస్థ అంత ఇమేజ్ ని సంపాదించడానికి ప్రధాన కారణం ఆ సంస్థ అధినేత అల్లు అరవింద్. ఈ విషయం సినీ ప్రేమికుల అందరికి తెలిసిందే. హీరో తో పాటు కథ కి ప్రాముఖ్యత ఇవ్వడం వలనే గీతా ఆర్ట్స్ 40 సంవత్సరాల నుంచి అప్రహతీతంగా ముందుకు దూసుకుపోతుంది. తాజాగా ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్ కన్నడ సూపర్ స్టార్ యష్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ సర్కిల్స్ లో చర్చినీయాంశ మయ్యాయి.

గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ అయిన జి ఏ 2 బ్యానర్ పై బన్నీ వాసు తెరకెక్కించిన మూవీ కోటబొమ్మాళి పిఎస్.ఈ సినిమా టీజర్ రిలీజ్ కి సంబంధించిన కార్యక్రమంలో అల్లు అరవింద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొంత మంది విలేకర్లు అరవింద్ గారితో మీరు ఎందుకని ఈ మధ్యన చిన్న సినిమాలని మాత్రమే నిర్మిస్తున్నారని అడిగారు. దానికి ఆయన భారీగానే బదులు ఇచ్చాడు. కొంత మంది నేను భారీగా పెరిగిన సినిమా నిర్మాణ వ్యయం మూలంగానే పెద్ద సినిమాలని తెరకెక్కించడం లేదని అనుకుంటున్నారని అదంతా అబద్దం అని ఆయన అన్నారు.

అసలు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలోను బయట కూడా సినిమా బడ్జట్ ఎక్కువగా పెరగడానికి హీరోలు తీసుకునే రెమ్యునరేషనే కారణం అనే చర్చ కూడా జరుగుతుంది. హీరో రెమ్యునరేషన్ కేవలం సినిమా బడ్జట్ లో 25 శాతం మాత్రమే అని కూడా ఆయన అన్నారు. అంతటి తో ఆగకుండా హీరోతో సంబంధం లేకుండా కేజిఎఫ్ సినిమాని నిర్మాతలు భారీ వ్యయంతో తెరకెక్కించలేదా? కేజిఎఫ్ రిలీజ్ కి ముందు ఆ సినిమా హీరో యష్ గురించి ఎవరికైనా తెలుసా ? కేజిఎఫ్ సినిమా తర్వాతే యష్ ఎవరో అందరికి తెలిసిందని అరవింద్ అన్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే సౌత్ ఫిలిం సర్కిల్స్ లో సెగలు పుట్టిస్తున్నాయి.

జి ఏ 2 బ్యానర్లో తెరకెక్కుతున్న కోటబొమ్మాళి పి ఎస్ మూవీ మలయాళ హిట్ మూవీ నాయప్పు కి రీమేక్ గా తెరకెక్కుతుంది.తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లు నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.