English | Telugu

అల్లు అరవింద్ కి బిగ్ షాక్.. రంగంలోకి ఈడీ..!

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంకు స్కాం కేసుకు సంబంధించి అరవింద్‌ ను ఈడీ అధికారులు దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించారని సమాచారం. 2018-19 సంవత్సరాల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై అల్లు అరవింద్‌ ను ఈడీ అధికారులు వివరాలు అడిగినట్లు వినికిడి. విచారణ అనంతరం వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని అల్లు అరవింద్‌ కు అధికారులు ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు.

రామకృష్ణ సంస్థ.. బ్యాంకుల నుంచి వంద కోట్లకు పైగా రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదని తెలుస్తోంది. లావాదేవీలలో అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఆ సంస్థ లావాదేవీలలో అల్లు అరవింద్ పేరు కూడా ఉండటంతో.. ఈడీ విచారణకు పిలిచిందని చెబుతున్నారు. అయితే అసలు ఆ సంస్థతో గానీ, ఆ స్కాంతో గానీ అల్లు అరవింద్ కి సంబంధం ఉందా లేదా? అని స్పష్టత లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.