English | Telugu

ఓటు వెయ్యని వారికి అలా మాట్లాడే హక్కు లేదు : అల్లు అరవింద్‌

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉదయం నుంచే ఎన్నికల సందడి మొదలైంది. సామాన్య ప్రజలే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా బాధ్యతగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి అందరితోపాటు క్యూలో నిలబడి ఓటు వేసి.. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఓటింగ్‌ శాతం తక్కువగానే ఉందని చెప్పాలి. అయితే ఎన్నో విషయాల్లో వెనుకబడి ఉంది అని చెప్పుకునే ఆదిలాబాద్‌ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 60 శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా హౖెెదరాబాద్‌లో ఇప్పటివరకు 21 శాతం మాత్రమే ఓట్లు పోలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది హైదరాబాద్‌లో ఎక్కువగా చదువుకున్నవారు, ఉన్నతమైన పదవులు నిర్వహిస్తున్నవారు ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనేది గుర్తించకుండా ఓటింగ్‌లో పాల్గొనకపోవడం పలువురిని బాధిస్తోంది.

తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పోలింగ్‌ శాతం తక్కువగా ఉండడాన్ని తట్టుకోలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓటు వెయ్యకుండా ఇంట్లో కూర్చుంటారు చూడండీ.. వాళ్లకి నేను ఒకటి చెబుతున్నా.. డోంట్‌ గ్రిప్‌.. ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదు. వాళ్ళు అలాగా.. వీళ్ళు ఇలాగా.. అని మాట్లాడే హక్కు మీకు లేదు. దాన్ని మీ మనసులో కూడా ఉంచుకోకూడదు. అలాంటిదేమైనా ఉందీ అంటే.. మీరు వచ్చి ఓటు వెయ్యండి. ఇవాళ హాలీడేలే అని బీరు తాగి పడుకునేవాళ్ళు సిటీలో చాలా మంది ఉన్నారు’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.