English | Telugu

ఓటీటీలో అల్లరి నరేష్ ఉగ్రరూపం!

'నాంది' వంటి హిట్ తర్వాత అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కలయికలో రూపొందిన రెండో చిత్రం 'ఉగ్రం'. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా మే 5న థియేటర్లలో విడుదలైంది. 'నాంది' స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ, పరవాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా నరేష్ నటనకు, యాక్షన్ సన్నివేశాలకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.

'ఉగ్రం' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 2 నుంచి 'ఉగ్రం' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. మరి ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

మిర్నా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించాడు. తూమ్ వెంకట్ కథ అందించగా, సినిమాటోగ్రాఫర్ గా సిద్ధార్థ్ జె, ఎడిటర్ గా చోటా కె. ప్రసాద్ వ్యవహరించారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.