English | Telugu

ఇంట్ర‌స్టింగ్‌... లియోతో అజిత్ సినిమా క‌నెక్ష‌న్‌!

విజ‌య్ హీరోగా న‌టిస్తున్న సినిమా లియో. లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అక్టోబ‌ర్ 19న విడుద‌ల కానుంది లియో సినిమా. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. బ్ల‌డీ స్వీట్ అంటూ ప్రోమో విడుద‌ల చేసిన‌ప్ప‌టి నుంచే ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ మామూలుగా లేవు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌కు కూడా సూప‌ర్‌డూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలోని కీ పార్టును కాశ్మీర్‌లో తెర‌కెక్కించారు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. ఈ సినిమా స్టార్ట్ అయిన‌ప్పుడే అజిత్ సినిమా కూడా మొద‌లు కావాల్సింది. 2023 సంక్రాంతికి అజిత్‌, విజ‌య్ ఇద్ద‌రూ సిల్వ‌ర్‌స్క్రీన్స్ మీద పోటీప‌డ్డారు. ఎవ‌రికి వారు స‌క్సెస్ సాధించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ఒకేసారి సినిమాను మొద‌లుపెట్టి, మ‌ళ్లీ అక్టోబ‌ర్‌లోనూ థియేట‌ర్ల ద‌గ్గ‌ర పోటీప‌డ‌తార‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే అజిత్ సినిమా ఆల‌స్య‌మైంది. స్టార్ట్ కావాల్సిన విఘ్నేష్ శివ‌న్ సినిమా ఆగిపోయింది. ఆ త‌ర్వాత సీన్‌లోకి డైర‌క్ట‌ర్ మ‌గిళ్ తిరుమేని కూడా వ‌చ్చారు. ఆ గ్యాప్‌లోనే బైక్ మీద ట్రిప్ కి వెళ్లారు అజిత్‌. ఫ్యామిలీతో వెకేష‌న్ కూడా వెళ్లారు.

త్వ‌ర‌లోనే అబుదాబిలో అజిత్ సినిమా షూటింగ్ మొద‌లుకానుంది. విడాముయ‌ర్చి అని టైటిల్ పెట్టారు నిర్మాత‌లు. ఈ సినిమాకు సంబంధించిన క్రూ ఆల్రెడీ అబుదాబికి ట్రావెల్ చేస్తోంది. అక్క‌డ షూటింగ్‌కి కావాల్సిన అన్ని హంగులూ స‌మ‌కూరుతున్నాయి. ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. చెన్నైలోని, నార్త్ ఇండియాలోనూ కొంత భాగాన్ని తెర‌కెక్కించి, ఆ త‌ర్వాత పూర్తిగా ఫారిన్ లొకేష‌న్ల‌లోనే తెర‌కెక్కించ‌నున్న‌ట్టు టాక్‌. ఈ సినిమాకు విజ‌య్ న‌టించిన లియోకి నాలుగు విష‌యాల్లో పోలిక ఉంది. అది కూడా న‌టీన‌టుల పరంగానే. విజ‌య్ న‌టించిన లియోలో న‌టించిన సంజ‌య్ ద‌త్‌, త్రిష‌, అర్జున్ ఈ సినిమాలోనూ కీ రోల్స్ లో క‌నిపిస్తారు. అర్జున్ దాస్ కూడా కీ రోల్ చేయ‌నున్నార‌ట‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.