English | Telugu

ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్‌ కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్‌ కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూఈ రోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆహుతి ప్రసాద్‌ ఈ రోజు కన్నుమూశారన్న వార్తతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆహుతి ప్రసాద్‌ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్‌.‘ ఆహుతి’ సినిమాతోని అతని నటనకు మంచి గుర్తింపు లభించింది. అప్పటినుంచి ఆహుతి ప్రసాద్‌గా సినీ పరిశ్రమలో స్థిరపడిపోయారాయన . ఆహుతి ప్రసాద్‌ నటించిన చివరి చిత్రం రుద్రమదేవి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.