English | Telugu

ఆహుతి ప్రసాద్‌ కు అనారోగ్యం

సాయికుమార్ తండ్రి మనవడి పెళ్లి మరుసటి రోజే చనిపోగా, రెండ్రోజుల వ్యవధిలో సంగీత దర్శకుడు చక్రి మృతి చెందారు. ఈ వార్తలను విని టాలీవుడ్ కోలుకోక ముందే ఆహుతి ప్రసాద్ ఆస్పత్రి పాలయ్యారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆహుతి ప్రసాద్‌కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన ఆహుతి ప్రసాద్‌ని బంధువులు, స్నేహితులు, సినీ రంగానికి చెందిన వారు పరామర్శిస్తున్నారు. టాలీవుడ్లో ఆహుతి ప్రసాద్ గొప్ప నటుడు. తన నటనా చాతుర్యంతో తను నటించిన ప్రతి సినిమాకు కీలంగా నిలిచేవారు. చందమామ సినిమాకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకున్న ఆహుతి ప్రసాద్ బెండు అప్పారావు, గులాబి, నిన్నేపెళ్లాడుతా, కొత్త బంగారు లోకం వంటి సినిమాల్లో చాలా మంచి పాత్రలు చేశారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.