English | Telugu

అప్పుడు మంచు విష్ణు.. ఇప్పుడు అక్కినేని అఖిల్!

పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న 'ఏజెంట్'పై అక్కినేని అఖిల్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై నమ్మకంతో తన మేకోవర్ ని మార్చుకొని ఎంతో కష్టపడ్డాడు అఖిల్. సినిమాకి హైప్ తీసుకురావడం కోసం ప్రమోషన్స్ లోనూ స్టంట్స్ చేసి కష్టపడుతున్నాడు. 172 అడుగుల ఎత్తు నుంచి రోప్స్ సాయంతో దిగుతూ.. ఏజెంట్ ట్రైలర్ ను ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఒక వైల్డ్ పోస్టర్ ను అఖిల్ లాంచ్ చేశాడు. సినిమా కోసం అఖిల్ అంత రిస్క్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో గతంలో మంచు విష్ణు సైతం ఇలాంటి రిస్క్ చేశాడని గుర్తు చేసుకుంటున్నారు.

12 ఏళ్ళ క్రితం మంచు విష్ణు 'వస్తాడు నా రాజు'(2011) అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం. అప్పుడు ఈ చిత్రంపై ఎంతో నమ్మకం పెట్టుకున్న విష్ణు.. సినిమాలో రియల్ స్టంట్స్ చేయడమే కాకుండా ప్రమోషన్స్ లోనూ అదే దూకుడు చూపించాడు. హైదరాబాద్ లోని ఐమాక్స్ దగ్గర రోప్స్ సాయంతో చాలా ఎత్తు నుంచి దిగుతూ.. 'వస్తాడు నా రాజు' పోస్టర్ ను లాంచ్ చేశాడు. అప్పట్లో విష్ణు చేసిన స్టంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమా మాత్రం పరాజయం పాలైంది. మరి ఇప్పుడు విష్ణు తరహాలోనే ఎత్తు నుంచి దిగుతూ పోస్టర్ ను లాంచ్ చేసిన అఖిల్.. ఆ నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి హిట్ కొడతాడేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.