English | Telugu

'ఏజెంట్'కి ఎంత కష్టమొచ్చింది!

ఆలస్యం అమృతం విషం అనే మాట అక్కినేని అఖిల్ తాజా చిత్రం 'ఏజెంట్'కి సరిగ్గా సరిపోతుంది. మామూలుగా పాన్ ఇండియా సినిమా అంటే.. ఎంతో కొంత హైప్ క్రియేట్ అవుతుంది. మొదట్లో ఏజెంట్ విషయంలోనూ అదే జరిగింది. కానీ ఆలస్యం కారణంగా ఈ సినిమాకి వచ్చిన హైప్ కూడా పోయింది. దీంతో అప్పట్లో భారీ ధరలకు రైట్స్ దక్కించుకోవడానికి ముందుకొచ్చిన బయ్యర్లు.. ఇప్పుడు భారీగా కోత పెడుతున్నారట.

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్'. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఎప్పుడో ప్రారంభమైన ఈ మూవీ గతేడాదే విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడుతూ వచ్చింది. అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ తో పాటు.. పాన్ ఇండియా మూవీ కావడంతో మొదట్లో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అఖిల్ మేకోవర్, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో.. బయ్యర్లు కూడా థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడానికి ఆసక్తి చూపించారు. ఒకానొక సమయంలో 60-70 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసే అవకాశముందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ నమ్మకంతోనే మేకర్స్ వెయిట్ చేసినట్టున్నారు. అయితే పదే పదే వాయిదా పడుతూ సినిమా ఆలస్యమవ్వడంతో.. ప్రేక్షకులతో పాటు బయ్యర్లలోనూ ఆసక్తి తగ్గిపోయింది. అప్పట్లో భారీ ధరకు రైట్స్ అడిగిన వారే, ఇప్పుడు అందులో సగానికి తీసుకుంటాం అంటున్నారట. దీంతో సొంతంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు న్యూస్ వినిపిస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.