English | Telugu

కట్టిపడేస్తున్న 'ఆదిపురుష్' ఫైనల్ ట్రైలర్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఇందులో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి, పాటలకి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫైనల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

'ఆదిపురుష్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ తో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొన్న ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. లక్షమందికి పైగా ఈ వేడుకకు హాజరయ్యారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా కొత్త ట్రైలర్ ను విడుదల చేశారు. ఫైనల్ ట్రైలర్ పేరుతో విడుదల చేసిన ఈ ట్రైలర్ కట్టిపడేస్తోంది.

రావణాసురుడు మారువేషంలో వచ్చి సీతను అపహరించే సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమైంది. సీతను బంధించి రావణుడి పాత్రను క్రూరుడిగా పరిచయం తీరు ఆకట్టుకుంది. "వస్తున్నా రావణ. న్యాయం రెండు పాదాలతో, నీ పది తలల అన్యాయాన్ని అణిచివేయడానికి. వస్తున్నా నా జానకిని తీసుకువెళ్ళడానికి" అంటూ రాముడిగా ప్రభాస్ ను చూపించిన తీరు కట్టిపడేసింది. భారీ యుద్ధ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ మెప్పిస్తోంది. ''ఈ దశకంఠుడు పదిమంది రాఘవులు కన్నా ఎక్కువ" అని రావణుడు అనగా.. "పాపం ఎంత బలమైనదైనా.. అంతిమ విజయం సత్యానిదే" అంటూ రాముడి మాటతో ట్రైలర్ ని ముగించిన తీరు బాగుంది. మొత్తానికి ఈ ఫైనల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.