English | Telugu

వ్య‌భిచారం కేసులో మ‌రో టాలీవుడ్ హీరోయిన్‌

సినీ ప‌రిశ్ర‌మ ఓ మేడి పండు. అన్నీ పైపై సొబ‌గులే. లోప‌ల మొత్తం పురుగుల పుట్ట‌. కొంత‌మంది క‌థానాయిక‌లు అడ్డ‌దారులు తొక్కుతూ.. సినీ ప‌రిశ్ర‌మ‌కి మ‌రింత చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఆ మ‌ధ్య ఓ క‌థానాయిక బ్రోత‌ల్ కేసులో ప‌ట్టుబ‌డి.. వార్త‌ల‌కెక్కింది. ఆ విష‌యం ఇంకామ‌రుగున ప‌డ‌క‌ముందే మ‌రో క‌థానాయిక కూడా వ్య‌భిచారం కేసులో అరెస్ట‌య్యింది. తెలుగు, హిందీ చిత్రాల‌తో కాస్త పేరు తెచ్చుకొని, ఇప్పుడు అవ‌కాశాలు లేక అల్లాడుతున్న ఓ క‌థానాయిక ని వ్య‌భిచారం కేసుపై గోవా పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆమె పేరు చెప్ప‌డానికి నిరాక‌రించారు. గోవాలోని ఓ స్టార్ హోట‌ల్‌లో ఈ క‌థానాయిక వ్య‌భిచారం చేస్తూ పోలీసుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిపోయింది. అయితే తాను అమాయ‌కురాలిన‌ని, త‌న‌ని అడ్డంగా ఈ కేసులో బుక్ చేశార‌ని ఆమె ఆరోపిస్తోంది. హోటల్ రూమ్ విటుడి పేరుతోనే బుక్ అవ్వ‌డం, ఆ గ‌దిలో ల‌క్ష‌ల రూపాయ‌ల క్యాష్ దొర‌క‌డంతో ఈ క‌థానాయిక ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. మ‌రి ఆ క‌థానాయిక ఎవర‌నేదే ప్ర‌స్తుతం స‌స్పెన్స్‌గా మారింది. పోలీసులు ఏ పేరు బ‌య‌ట‌పెడ‌తారో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.