English | Telugu

కారులోనే మరణించిన నటుడు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు!

ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో విషాద వార్తలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొందరు అనారోగ్యంతో మరణిస్తుంటే, మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకొందరి మృతి అనుమానాస్పదంగా మారుతోంది. తాజాగా మరో మరణవార్త సినీ పరిశ్రమ వినాల్సి వస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు వినోద్‌ థామస్‌ అనుమానాస్పద మృతి ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.కొట్టాయం జిల్లా పాంపడి ప్రాంతంలోని ఓ హోటల్‌ దగ్గరలో ఓ కారు ఎంతో సేపటి నుంచి పార్క్‌ చేసి ఉండడాన్ని గమనించారు. అందులో ఓ వ్యక్తి చలనం లేకుండా ఉండడాన్ని హోటల్‌ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వినోద్‌ మరణ వార్త వెలుగులోకి వచ్చింది.

కారులో విగతజీవిగా పడి ఉన్న వినోద్‌ను వెంటనే హాస్పిటల్‌కి తరలించామని, అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారని పోలీసులు వివరించారు. వినోద్‌ మృతికి కారణం ఏమిటో ఇంతవరకు తెలియలేదు. కారు ఏసీలో నుంచి వచ్చిన విషపూరిత వాయువు వల్లే అతను మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఇది ఎవరైనా పథకం ప్రకారం చేశారా లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే విషయాలు పోస్టుమార్టం తర్వాతే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. హ్యాపీ వెడ్డింగ్‌, జూన్‌ వంటి సినిమాల్లో నటించిన వినోద్‌ థామస్‌ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. వినోద్‌ హఠాన్మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.