English | Telugu

అనూహ్యంగా పుంజుకున్న వార్-2.. కూలీకి షాక్ తప్పదా?

ఆగస్టు 14న 'వార్-2', 'కూలీ' అనే రెండు భారీ సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టాయి. ఈ రెండు సినిమాలపైనా మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే 'వార్-2'తో పోలిస్తే 'కూలీ'పై హైప్ ఇంకా ఎక్కువ ఉంది. అది అడ్వాన్స్ బుకింగ్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపించింది. అయితే విడుదల తర్వాత ఈ రెండు సినిమాలు డివైడ్ టాక్ నే సొంతం చేసుకున్నాయి. అయినప్పటికీ మొదటి వీకెండ్ లో 'వార్-2' దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ రాబడితే.. 'కూలీ' మాత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ తో సత్తా చాటింది. ఇలా అడుగడుగునా కూలీ డామినేషన్ కనిపిస్తోంది. దీంతో ఇక 'వార్-2' పని అయిపోయినట్లేనని అందరూ భావించారు. కానీ, ఇలాంటి టైంలో 'వార్-2' అనూహ్యంగా పుంజుకొని షాక్ ఇచ్చింది.

ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా పాజిటివ్ టాక్ రాకపోతే వీక్ డేస్ లో భారీ డ్రాప్ కనిపించడం సహజం. 'వార్-2', 'కూలీ' సినిమాల విషయంలోనూ అదే జరిగింది. సోమవారం నాడు ఈ రెండు సినిమాల కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. ముఖ్యంగా 'వార్-2' పూర్తిగా చేతులెత్తేసినట్లు అనిపించింది. ఇలాంటి సమయంలో ఊహించని విధంగా పుంజుకొని బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది వార్-2.

మంగళవారం నాడు బుక్ మై షోలో బుకింగ్స్ ని గమనిస్తే.. 'వార్-2' టికెట్లు గంటకు 9.2K బుక్ అవ్వగా, 'కూలీ' టికెట్లు మాత్రం 4.9K బుక్ అయ్యాయి. అంటే బుక్ మై షోలో 'కూలీ'కి దాదాపు రెట్టింపు స్థాయిలో 'వార్-2' టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. ఫుల్ రన్ లో 'కూలీ'కి 'వార్-2' షాకిచ్చినా ఆశ్చర్యంలేదు.

ఓవరాల్ గా ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'వార్-2'కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ నటించినప్పటికీ తెలుగు బుకింగ్స్ లో ఆ జోష్ లేదు. నార్త్ లో మాత్రం జోష్ కనిపిస్తోంది. హిందీ సినిమా కావడం, ప్రస్తుతం అక్కడ ఇతర స్టార్ల సినిమాలు లేకపోవడంతో.. వార్-2 చూడటానికి నార్త్ ఆడియన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే బుక్ మై షోలో 'కూలీ'ని 'వార్-2' ఈ రేంజ్ లో డామినేట్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.