English | Telugu

త్రిషకు యోగా చేయ్యటానికి టైమ్ లేదు

త్రిషకు యోగా చేయ్యటానికి టైమ్ లేదు అని విశ్వసనీయ వర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే తమ శరీర సౌష్టవాన్ని కాపాడుకోవటానికి ప్రతి సినీ నటీ లేదా నటుడూ వ్యాయామమో, యోగానో, జాగింగో ఇలా ఏదో ఒకటి చేయాలి. అలా చేసి తమ శరీర సౌష్టవాన్ని, ముఖంలోని గ్లామర్ ని నిరంతరం కాపాడుకుంటూ ఉండాలి. లేదంటే వారికి సినీ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇది అందరికీ తెలిసిన సంగతే. అందుకే త్రిష తన గ్లామర్ కాపాడుకోటానికీ, తన శరీర సౌష్టవాన్ని అందంగా ఉంచుకోటానికీ యోగాపై ఆధారపడింది.

అందుకే త్రిష క్రమం తప్పకుండా యోగా చేస్తూంటుంది. కానీ ఈ మధ్య ఆమెకు యోగా చేయటానికి టైమ్ దొరకటం లేదు. కారణం శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, మలినేని గోపిచంద్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న "బాడీ గార్డ్" సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూంది. ఈ సినిమా షుటింగ్ చాలా వేగంగా జరగటం వల్ల త్రిషకు యోగా చేయటానికి వీలు కుదరటం లేదట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను విశాఖపట్టణంలో చిత్రీకరించారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.