English | Telugu

మెగా హీరో 'కంచె' పూర్తి

'ముకుంద' చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు మెగా బ్రదర్ నాగాబాబు తనయుడు వ‌రుణ్‌తేజ్‌. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయినా.. వ‌రుణ్ మాత్రం ఓకే అనిపించుకొన్నాడు. ఇప్పుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. టైటిల్ 'కంచె'. ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తయ్యింది. ఈ రోజు చిత్రానికి గుమ్మడికాయ్ కొట్టేశారు. 1940 కాలం నాటి క‌థ ఇది. ఇందులో వ‌రుణ్ ఓ సైనికుడిగా క‌నిపిస్తాడ‌ని టాక్‌. ప్రేమ‌, దేశ‌భక్తి క‌ల‌బోసిన ఈ క‌థ‌లో అన్నిర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాలూ ఉంటాయ‌ని యూనిట్ చెబుతోంది. ఈ చిత్రం తర్వాత పూరీ దర్శకత్వంలో చిత్రానికి రెడీ అవుతున్నాడు వరుణ్. జూలై 10న ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.