English | Telugu

పవన్ కు పోటీగా "వర్ణ" ట్రైలర్

ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్ర ట్రైలర్ విడుదలై, రికార్డు స్థాయిలో హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రికార్డులను బ్రేక్ చేసే విధంగా హీరోలతో సమానంగా పోటీ పడుతుంది హీరోయిన్ అనుష్క. అనుష్క నటిస్తున్న తాజా తెలుగు,తమిళ చిత్రం "వర్ణ". ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి స్పందనను సంపాదించుకుంటుంది. ఆదివారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ను ఇప్పటికే 6 లక్షలకు పైగా మంది చూశారు. ఈ విధంగా అనుష్క కూడా స్టార్ హీరోలతో సమానమైన ఫాలోయింగ్ ఉందనే చెప్పుకోవచ్చు.

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క కు జంటగా ఆర్య నటిస్తున్నాడు. పూర్తి ఆసక్తికరంగా ఉన్న చిత్ర ట్రైలర్ ను చూస్తే "అవతార్" వంటి గ్రాఫిక్స్ చిత్రాలు గుర్తొస్తున్నాయి. మరి ఈ చిత్రం ట్రైలర్ కే ఇంత రెస్పాన్స్ వస్తే, సినిమా విడుదలయ్యాక ఎలా ఉండబోతుందో మరి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.