English | Telugu

ఉద‌యభానుకు చిరు, బాల‌య్య ఝ‌ల‌క్‌!


ఉద‌య‌భాను యాంక‌రింగు మాటేమో గానీ, ఎగ‌స్ట్రాలు మాత్రం బాగానే చేస్తుంది. వీక్ష‌కుల‌కు హుషారు తెప్పించాల‌న్న ఉద్దేశంతో కాస్త‌ ఓవ‌రాక్ష‌న్ చేస్తుంటుంది. ఉద‌య‌భాను స్పీడు మాత్రం వేదిక‌పై ఉన్న‌వారికి త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతుంది. ఆదివారం రాత్రి జ‌రిగిన టీ ఎస్ ఆర్ అవార్డుల కార్య‌క్ర‌మంలో ఉద‌య‌భాను వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించింది. అల‌వాటు ప్ర‌కారం ఇక్క‌డా... త‌న ఓవ‌రాక్ష‌న్ చూపించింది.

ఉత్తమ న‌టుడిగా అవార్డు అందుకొన్న అనంత‌రం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు మ‌ధ్య మ‌ధ్య‌లో ప్రామ్టింగ్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించింది భాను. ముందు కాస్త లైట్‌గా తీసుకొన్నా, త‌రువాత మాత్రం బాల‌య్య సీరియ‌స్ అయ్యాడు. 'ఆపు.. నేను చెప్తా..' అని సీరియ‌స్ గా ఉద‌య‌బాను వంక చూశాడు.. ఆ త‌ర‌వాత తేరుకొని చిరు న‌వ్వు చిందించాడు. చిరంజీవి విష‌యంలో ఉద‌య‌భాను కాస్త అతిగా స్పందించింది. 'చిరు సార్ 150వ సినిమా ఎప్పుడు' అని సంద‌ర్భం లేకుండా చిరుని ఒక‌ట్రెండు సార్లు అడిగింది. అందుకు చిరు కాస్త సీరియ‌స్‌గానే 'ఆగు..' అన్న‌ట్టు సంజ్ఞ చేశాడు. దాంతో ఉద‌య‌బాను స్పీడుకు బ్రేకులు ప‌డ్డాయి.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.