English | Telugu

చిరు కావాలంటున్న ముదురు భామ‌లు


చిరంజీవి 150వ సినిమా కోసం క‌థానాయిల మ‌ధ్య పోటీ ఎక్కువ‌వుతోంది. ఇప్ప‌టికే చిరు ప‌క్క‌న న‌టించాల‌ని వుంది అని చాలామంది క‌థానాయిక‌లు త‌మ మ‌న‌సులోని మాట చెప్పేశారు. ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు ముదురు భామ‌లు జ‌త క‌లిశారు. వాళ్లే శిల్పాశెట్టి, ర‌వీనాఠండ‌న్‌. ఈ బాలీవుడ్ భామ‌లు తెలుగులోనూ సినిమాలు చేశారు. అదీ.. టాప్ స్టార్ల‌తో. కానీ చిరంజీవితో క‌ల‌సి న‌టించే అవ‌కాశ‌మే రాలేదు. అందుకే చిరు సినిమాలో న‌టించాల‌ని వుంది అని త‌మ మ‌న‌సులోని మాట బ‌యట‌పెట్టారు..

అదీ చిరంజీవి స‌మ‌క్షంలో. టి.సుబ్బిరామిరెడ్డి అవార్డుల కార్య‌క్ర‌మానికి చిరు ముఖ్య అతిథిగా విచ్చేశారు. టీ ఎస్ ఆర్ అవార్డులు అందుకొన్న అనంత‌రం శిల్పాశెట్టి, ర‌వీనా.. ఇద్ద‌రూ `చిరంజీవితో సినిమా చేయాల‌ని అనుకొన్నా.. కానీ అప్ప‌ట్లో కుద‌ర్లేదు` అంటూ త‌మ మ‌న‌సులోని మాట చెప్పేశారు. అందుకు చిరు కూడా చిరున‌వ్వుతోనే స‌మాధానం ఇచ్చాడు. క‌నీసం చిరు 150వ సినిమా కోస‌మైనా వీళ్లిద్ద‌రి పేర్లూ ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.