English | Telugu

'షరతులు వర్తిస్తాయి' ఫస్ట్ లుక్ విడుదల చేసిన త్రివిక్రమ్

స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల, శ్రీష్ కుమార్ గుండా, కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాణంలో కుమార స్వామి(అక్షర) దర్శకత్వంలో చైతన్య రావు- భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ... మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి. షరతులు వర్తిస్తాయి చిత్రం కుటుంబ విలువలకు సంబంధించిన సినిమా. ఈ ప్రాంతం మట్టి నుంచి వచ్చిన కథ. ఇది మన కుటుంబ సంస్కృతిక విలువలతో నిండి ఉన్న సినిమా. ఇటువంటి మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ప్రోత్సహించాలి" అన్నారు.

చిత్ర హీరో చైతన్య రావు మాట్లాడుతూ... "మా సినిమా ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ను నాకు ఎంతో ఇష్టమైన దర్శకుడు త్రివిక్రమ్ గారు ఆవిష్కరించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇంత బిజీ లో కూడా మాకు సమయం కేటాయించి మమ్ములను ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు" అన్నారు.

చిత్ర దర్శకుడు కుమార స్వామి ( అక్షర ) మాట్లాడుతూ... "ఒక మంచి ఉద్దేశంతో తీసిన సినిమా. త్వరలోనే విడుదల కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ త్రివిక్రమ్ సార్ తో ఆవిష్కరించాలని నా కల అని అడిగిన వెంటనే సహాయ సహకారాలు అందించిన మామిడి హరికృష్ణ గారికి, అంగీకరించిన గురూజీ త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు" అన్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.