English | Telugu

ఆ రెండు రోజులు టాలీవుడ్ కు సెలవు

రాష్ట్రంలో ఎన్నికల కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ విశ్రాంతిని ప్రకటించింది. సినీ పరిశ్రమకు చెందినవాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈనెల 30న టాలీవుడ్ మొత్తం షూటింగ్ లు నిర్వహించకూడదంటు ఎపి ఫిలింఛాంబర్ నిబంధన విధించింది. ఆ రోజు సాయంత్రం 6గంటల తర్వాత షూటింగ్ లు జరుపుకోవడానికి అనుమతించింది. షూటింగ్ లతో పాటుగా థియేటర్లు కూడా సాయంత్రం 6 గంటల వరకు మోసేయల్సిందిగా ఎపి ఫిలింఛాంబర్ నిర్ణయించింది. ఈ నిబంధన మే7న సీమంధ్రలో జరిగే ఎన్నికలకు కూడా వర్తిస్తుందని తెలిపింది. అంటే రెండు రోజుల పాటు షూటింగ్ మరియు థియేటర్లు బంద్ అన్నమాట.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.