English | Telugu

సినీరచయిత తోట ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్

సినీ రచయిత తోట ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు తెలియజేశారు. ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కి సుమారు ఇరవై లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ప్రముఖ సినీరచయిత తోట ప్రసాద్ వయస్సు నలభై నాలుగు సంవత్సరాలు. సినీ రచయిత తోట ప్రసాద్ "కంత్రీ, వరుడు, సీతారాముల కళ్యాణం లంకలో, పంచాక్షరి" వంటి చిత్రాలకు సంభాషణలు వ్రాశారు. సినీ రచయిత తోట ప్రసాద్ కి ఇరవై లక్షలు ఖర్చుతో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోగల ఆర్థిక స్తోమతు లేదు. కనుక ఆయనకు ఆర్థిక సాయం అందజేయతలచిన దాతలు ఈ దిగువన ఇవ్వబడ్డ బ్యాంక్ ఎకౌంట్ కు డబ్బు పంపవలసిందిగా ప్రార్థన. మనసున్న మానవతా వాదులందరూ సినీ రచయిత తోట ప్రసాద్ కి ఆర్థిక సాయం అందించాల్సిందిగా ప్రార్థన.

టి.యన్. యల్.వి.ప్రసాద్,

యాక్సిస్ బ్యాంక్,

జూబ్లీ హిల్స్ బ్రాంచ్,

ప్రయారిటీ ఎకౌంట్ నంబర్ - 910010007634540 కి డబ్బు పంపవచ్చు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.