English | Telugu

ఈ వారం ఓటీటీలో వినోదాల విందు.. ఒకేసారి ఇన్ని సినిమాలు, సిరీస్ లా!

హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ రూపొందించిన 'అవతార్-3' నేడు(డిసెంబర్ 19) థియేటర్లలో అడుగుపెట్టింది. అలాగే గుర్రం పాపిరెడ్డి, మారియో వంటి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ వారం ఓటీటీలోనూ బాగానే సందడి ఉంది.

వరుణ్ సందేశ్ నటించిన 'నయనం' అనే సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిసెంబర్ 19 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది. థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై, మంచి విజయాన్ని సాధించిన రా లవ్ స్టోరీ 'రాజు వెడ్స్ రాంబాయి' ఈటీవీ విన్ లో అడుగుపెట్టింది. అలాగే 'సంతాన ప్రాప్తిరస్తు', 'ప్రేమంటే' సినిమాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. వీటితో పాటు నివిన్ పౌలీ నటించిన 'ఫార్మా' వెబ్ సిరీస్, మమ్ముట్టి 'డొమినిక్' మూవీ, 'దివ్య దృష్టి' సినిమా అందుబాటులోకి వచ్చేశాయి. (OTT Releases This Week)

అమెజాన్ ప్రైమ్ వీడియో:
థామా మూవీ - డిసెంబర్ 16
సంతాన ప్రాప్తిరస్తు - డిసెంబర్ 19

ఈటీవీ విన్:
రాజు వెడ్స్ రాంబాయి మూవీ - డిసెంబర్ 18

నెట్ ఫ్లిక్స్:
ఎమిలీ ఇన్ పారిస్ 5 (వెబ్ సిరీస్) - డిసెంబర్ 18
ప్రేమంటే మూవీ - డిసెంబర్ 19
రాత్ అకేలీ హై 2 (వెబ్ సిరీస్) - డిసెంబర్ 19

జీ5:
నయనం వెబ్ సిరీస్ - డిసెంబర్ 19
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ - డిసెంబర్ 19

జియో హాట్ స్టార్:
సంతాన ప్రాప్తిరస్తు - డిసెంబర్ 19
ఫార్మా వెబ్ సిరీస్ - డిసెంబర్ 19
మిసెస్ దేశ్ పాండే వెబ్ సిరీస్ - డిసెంబర్ 19

సన్‌నెక్స్ట్:
దివ్య దృష్టి మూవీ - డిసెంబర్ 19

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.