English | Telugu

ది రాజాసాబ్ టీజర్ పై బేబీ నిర్మాత కీలక వ్యాఖ్యలు  

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)హర్రర్ కామెడీ గా తెరక్కుతున్న ఈ మూవీకి మారుతీ(Maruthi)దర్శకుడు కాగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజె విశ్వప్రసాద్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్(Nidhhi agewal)మాళవికా మోహనన్(Malavika Mohanan)జత కడుతుండగా సంజయ్ దత్, రిది కుమార్, మురళి శర్మ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


రీసెంట్ గా ప్రముఖ బేబీ సినిమా నిర్మాత ఎస్ కె ఎన్ ఒక మీడియా సమావేశంలో రాజా సాబ్ గురించి మాట్లాడుతు మారుతీ తో రీసెంట్ గానే మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం రాజా సాబ్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఈ రెండు వారాల్లోనే టీజర్ రాబోతుందని చెప్పాడు. నిజానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో రాజాసాబ్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎస్ కె ఎన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వస్తుండంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

ఇక ఇప్పటికే రాజాసాబ్ నుంచి ప్రభాస్ కి సంబంధించిన రెండు లుక్స్ రిలీజ్ అయ్యాయి. అందులో ఒక లుక్ లో లవర్ బాయ్ లాగా ఉండగా, రెండో లుక్ లో ఓల్డ్ గెటప్ తో కనపడ్డాడు. దీంతో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీజర్ లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.