English | Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!

గతేడాది 'కల్కి 2898 AD' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో 'ది రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్', 'సలార్-2', 'కల్కి-2' వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో 'రాజా సాబ్' మూవీ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుందని గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు విడుదల తేదీ మారినట్లు తెలుస్తోంది. (The Raja Saab)

మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా వాయిదా పడనుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ లో తమ సినిమాని విడుదల చేయనున్నట్లు పలువురు ప్రకటిస్తూ వస్తున్నారు. రాజా సాబ్ నిర్మాతల నుంచి వచ్చిన వాయిదా సమాచారంతోనే, ఇతర చిత్రాల నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై త్వరలోనే ప్రేక్షకులకు సైతం నిర్మాతలు క్లారిటీ ఇవ్వబోతున్నారని సమాచారం. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రాజా సాబ్ నుంచి ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేయనున్నారట మేకర్స్. ఆ పోస్టర్ తోనే సినిమా వాయిదా విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించనున్నారని టాక్.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.