English | Telugu

చార్మినార్ దగ్గర మహేష్ బాబు దూకుడు షుటింగ్

చార్మినార్ దగ్గర మహేష్ బాబు "దూకుడు" షుటింగ్ ప్రస్తుతం జరుగుతూందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "దూకుడు". ఈ మహేష్ బాబు "దూకుడు" కర్ణాటక పంపిణీ హక్కులు 2.15 cr కు నాగరాజుకి అమ్మినట్లు సమాచారం.

అలాగే మహేష్ బాబు "దూకుడు" సీడెడ్ పంపిణీ హక్కులను 5.70 cr కి బళ్ళారి సాయి సోంతం చేసుకున్నారు. మహేష్ బాబు "దూకుడు" నెల్లూరు పంపిణీ హక్కులను 1.30 cr కి శ్రీ నీలకంఠన్ ఫిలింస్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు "దూకుడు" సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో జరుగుతుందని తెలిసింది. మహేష్ బాబు "దూకుడు" సినిమా షుటింగ్ ఇంకా 40 రోజుల పాటు మిగిలి ఉందనీ, కనుక ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల చేయటం అసాధ్యమనీ, సెప్టెంబర్ నెలలోనే మహేష్ బాబు "దూకుడు" విడుదలయ్యే అవకాశాలున్నాయనీ సమాచారం.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.