English | Telugu

రామానాయుడు స్టుడియోలో నాగ్ డమరుకం

రామానాయుడు స్టుడియోలో నాగ్ "డమరుకం" షూటింగ్ జరుపుకుంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, యువసామ్రాట్, కింగ్, అక్కినేని నాగార్జున హీరోగా, అనుష్క హీరోయిన్ గా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం" డమరుకం". ఈ నాగ్ "డమరుకం" సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడాలోని రామానాయుడు సినీ విలేజ్ లో శరవేగంగా జరుగుతూంది. ఇటీవల జూన్ 6 వ తేదీ నుండి నాగ్ "డమరుకం" చిత్రం షూటింగ్ బి.హెచ్.ఇ.యల్.సమీపంలో కల శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివారి దేవాలయంలో అనుష్క, బ్రహ్మాజీ తదితరుల మీద చిత్రీకరించారు.

ఇప్పటికే ఈ నాగ్ "డమరుకం" సినిమాలోని ఒక పాటను హీరో నాగ్, హీరోయిన్ అనుష్కలపై యూరప్ లో చిత్రీకరించారు. ఇది నాగార్జున సిని కెరీర్ లోనే అత్యంతభారీబడ్జెట్ సినిమాగా నిర్మించబడుతుంది. 53 నిమిషాల పాటు గ్రాఫిక్స్ వర్క్ ఉండే ఈ చిత్రం బడ్జెట్ 50 కోట్లని సమాచారం.నాగ్ "డమరుకం" సినిమాకి యువ సంగీత తరంగం దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తూండగా, ఛోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.