English | Telugu

రెండు తెలుగు తమిళ సినిమాల పోటీ

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల పరిస్థితి వేడివేడిగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు ప్రేక్షకుల ముందుకు నాలుగు సినిమాలు వస్తున్నాయి. రెండు తెలుగు సినిమా కాగా.. రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు. శివాజీ, అర్చన జంటగా నటించిన "కమలతో నా ప్రయాణం" నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరొకటి తరుణ్, యామి గౌతమి జంటగా నటించిన "యుద్ధం" సినిమా కూడా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే తమిళంలో సూపర్ హిట్టయిన "రాజా రాణి" చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఆర్య, నయనతార, జై, నజ్రియా ప్రధాన పాత్రలలో నటించారు. అదే విధంగా విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రాన్ని తెలుగులో "ధీరుడు" పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మరి ఈ మూడు చిత్రాలు ఎలాంటి విజయాన్ని సాధిస్తాయో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.