English | Telugu

గంగను నమ్ముకున్న తెల్లపిల్ల

ఝుమ్మందినాదంలో కర్లీ హెయిర్ బ్యూటీని చూసి కత్తిలా ఉంది కంటిన్యూ అవుతుందిలే అనుకున్నారంతా. కానీ ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ ఒక్కటీ గుర్తింపునిచ్చే పాత్ర దక్కలేదు. పైగా ఐరెన్ లెగ్ అనే ముద్రవేసేశారు. అడపా దడపా సినిమాలు హిట్టైనా ఆ క్రెడిట్ హీరోల ఖాతాల్లోకి వెళ్లిపోయిందాయె. దీంతో కేవలం టాలీవుడ్ నే నమ్ముకోకుండా అన్ని వుడ్స్ పైనా దృష్టిపెట్టింది. లేటెస్ట్ గా లారెన్స్ తెరకెక్కించిన కాంచన సీక్వెల్ గంగలో కీ రోల్ ప్లే చేసింది తాప్సీ. ఈ సినిమాకోసం రెండేళ్లు కష్టపడ్డాఅని తగిన గుర్తింపు దక్కుతుందని గలగలా చెప్పేస్తోందట. చివరికి 9 గంటలపాటూ స్విమ్మింగ్ పూల్ లో ఉండి స్కిన్ ఇన్ ఫెక్షన్ కూడా వచ్చిందని....షూటింగ్ లో కష్టాలు ఏకరువు పెడుతోంది. అంతేనా గంగ మూవీకోసం ఎన్నో ఆఫర్స్ వదులుకుందట. ఇదంతా ఎందుకుతల్లీ అంటే....గంగ అదిరిపోద్దని....తన కెరీర్ ని టర్నింగ్ తిప్పేస్తుందని భారీ ఆశలు పెట్టుకుంది. మరి అమ్మడి ఆశల ఏ మేరకు నెరవేరుతాయో తెలియాలంటే గంగ విడుదల వరకూ ఆగాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.