English | Telugu

వేధిస్తున్నారంటు బోరున ఏడుస్తున్న ప్రముఖ హీరోయిన్.. ఆ హీరో అభిమానులా!  

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)దివంగత దర్శకుడు 'ఏఎస్ రవికుమార్ చౌదరి'(As Ravikumar Chowdary)కాంబినేషన్ లో వచ్చిన 'వీరభద్ర' అనే మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన బాలీవుడ్ నటి 'తనుశ్రీ దత్తా'. 2007 లో హిందీ సినీ రంగ ప్రవేశం చేసిన తనుశ్రీ పలు చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలని పోషించి, మంచి నటిగా గుర్తింపు పొందింది.

రీసెంట్ గా తనుశ్రీ దత్తా(Tanushree Dutta)సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతు నా ఇంటికి కొంత మంది వచ్చి నన్ను వేధించడంతో పాటు, బూతులు తిడుతు నరకం చూపిస్తున్నారు. నా ఆరోగ్యం దెబ్బతింది. ఎవరైనా సాయం చేయండంటూ భోరున విలపిస్తుంది. తనుశ్రీ గతంలో ప్రముఖ హీరో, లెజండ్రీ యాక్టర్ 'నానాపటేకర్'(Nanapatekar)పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయగా, కోర్టు కేసుని కొట్టి వేసింది. దీంతో అప్పట్నుంచి నానా పటేకర్ మనుషులు తనని వేదిస్తున్నారంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

నానాపటేకర్ నటించిన పలు సినిమాలు విడుదలకి ఉన్న నేపథ్యంలో తనుశ్రీ వీడియో బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది. తనుశ్రీ 2005 లో 'ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్'ని గెలుచుకుంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.