English | Telugu

తమన్నాకి మతి పోయింది

తమన్నాకి మతి పోయింది అని సినీ వర్గాలమటున్నాయి. మతి పోవటమంటే నిజంగా పోవటమని కాదు. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "ఊసరవెల్లి". ఈ చిత్రంలో హీరోయిన్ తమన్నాకి మెమొరీ లాస్ అనే జబ్బు ఉంటుందట. అంటే జ్ఞాపక శక్తి పోవటం అన్నమాట.

హీరోయిన్ మామూలుగా యాపిల్ పండులా ఉండి మాంచి తెలివితేటలుంటేనే జనం చూడాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. మరి మతిపోయిన హీరోయిన్ అంటే ఎలాచూస్తారో.అయినా కథకి అవసరమై హీరోయిన్ని అలా చూపిస్తున్నారేమోలెండి. ఈ సినిమా ఎలా ఉండేదీ రానున్న దసరాకి తేలిపోతుందిగా...ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ కెమెరామేన్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా, కొరటాల శివ మాటల రచయితగా పనిచేస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథనందించారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.