English | Telugu

వివాదంలో స్టార్ హీరోయిన్.. మొత్తం ఆమే చేసిందా..?

మనిషికి ఆశ ఉండొచ్చు కానీ, దురాశ ఉండకూడదు. ఇప్పుడు ఆ దురాశే ఓ ప్రముఖ హీరోయిన్ కి శాపంగా మారింది అంటున్నారు. బాలీవుడ్ కి చెందిన ఒకరు.. ఓ ఫేమస్ హీరోయిన్ ని టార్గెట్ చేస్తూ, తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. "ఒక ఫేమస్ పర్సన్ వల్ల కొద్దిరోజులుగా ఇబ్బంది పడుతున్నాను. ఆమె టీమ్ మెంబర్స్ మరియు కుటుంబసభ్యులు స్టుపిడ్ గా, అన్ ప్రొఫెషనల్ గా ఉంటారు. సౌత్ ఇండియన్ టీమ్ ఫ్రీగానో లేదా తక్కువ బడ్జెట్ లోనో వర్క్ చేస్తే.. మాతోనూ అలాగే చేయించుకోవాలని చూస్తారు. ఫ్యామిలీలో ఒకరు ఇరిటేట్ చేస్తుంటే, మరొకరు సారీ చెప్తున్నారు. నాకు మీతో కలిసి పనిచేయడం ఇష్టం లేదు. మీరు టీమ్ కి ఇవ్వాల్సిన పేమెంట్స్ చెల్లించకపోతే.. మీ పేర్లు బయటపెడతాను" అంటూ ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్ట్ చూసి.. ఇది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కి సంబంధించిన వివాదమని పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని, స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకునే స్థాయికి ఎదిగిన ఆమె.. ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆ హీరోయిన్ విషయంలో అన్నీ వెనకుండి చూసుకునేది ఆమె తల్లే అంటారు. సినిమాల ఎంపిక, రెమ్యూనరేషన్ ఇలా ప్రతి విషయంలో మదర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెబుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ వివాదానికి కూడా హీరోయిన్ మదరే కారణమని టాక్. మేకప్ టీమ్ ని తాము పెట్టుకుంటామని చెప్పి, ప్రొడ్యూసర్స్ నుంచి ఎక్కువ మొత్తం తీసుకొని.. ఆ టీమ్ కి మాత్రం సరిగా పేమెంట్స్ ఇవ్వట్లేదని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఎంతో తెలియాల్సి ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.