English | Telugu

టార్గెట్.. డబుల్ సెంచరీ !

"మహాత్మా" చిత్రంతో సెంచరీ పూర్తి చేసిన శ్రీకాంత్.. మరో రెండు మూడేళ్లో డబుల్ సెంచరీ కూడా చేసేయాలని డిసైడ్ అయిపోనట్లున్నారు. తన కాల్షీట్స్ డైరీని ఒక్కరోజు కూడా ఖాళీ ఉంచకుండా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు.

ప్రస్తుతం "మొండోడు", "ఆచార్య", "నాటుకోడి", "హంటర్" చిత్రం షూటింగ్స్‌తో క్షణం కూడా ఖాళీ లేకుండా ఉన్న శ్రీకాంత్ తాజాగా మరో చిత్రం అంగీకరించాడు. రైటర్ ఉదయ్‌రాజ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

శ్రీకాంత్ నటించిన సినిమా హిట్టయి కొన్ని "యుగాలు" గడిచిపోయాయి. అయినాసరే.. ఏదైనా అద్భుతం జరగకపోతుందా అన్న అత్యాశతో అతనితో వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. శ్రీకాంత్‌కు ఇప్పటికే కోటిన్నర వరకు శాటిలైట్ మార్కెట్ ఉండడం...రెమ్యూనరేషన్ విషయంలో పంతాలకు పోయే మనస్తత్వం శ్రీకాంత్‌కు లేకపోవడం వంటి కారణాలు శ్రీకాంత్‌కు వరుసగా సినిమాలు వచ్చేలా చేస్తున్నాయి!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.