English | Telugu

"బాబాయ్, అబ్బాయ్"ల వార్ !

బాబాయ్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న "అత్తారింటికి దారేది", అబ్బాయ్ రామ్‌చరణ్ నటిస్తున్న "ఎవడు" చిత్రాలు ఇంచుమించుగా ఒకే సమయంలో షూటింగ్స్ పూర్తి చేసుకొంటున్నాయి. ఈ రెండు చిత్రాల విడుదల మధ్య మినిమం మూడు వారాల గ్యాప్ మెయింటైన్ చేయడం తప్పనిసరి కావడంతో.. ఈ రెండు చిత్రాల విడుదల ఎలా ప్లా చేయాలన్న విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు.

ఆగస్టున "అత్తారింటికి దారేది" రిలీజ్ చేసి.. సెకెండ్ శాటర్‌డే, ఆగస్టు 15న సెలవుల్ని క్యాష్ చేసుకోవాలని ముందే డిసైడ్ అయిపోవడంతో.. జూలై రెండోవారంలో "ఎవడు" చిత్రాన్ని విడుదల చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే.. ఈనెల 30న ఆడియో విడుదల చేస్తున్నారు. ఒకే కాంపౌండ్‌ నుంచి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం ఇద్దరిఖీ ఎంతోకొంత నష్టాన్ని కలిగిసుంది. వాళ్లకు జరిగే నష్టం కంటె.. వాళ్ల నిర్మాతలకు జరిగే నష్టం ఎక్కువ. అందుకనే "బాబాయ్_అబ్బాయ్"ల మధ్య వార్ వాతావరణం ఏర్పడకుండా జాగ్రత్తల్లు తీసుకుటున్నారు!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.