English | Telugu

శ్రీకాంత్ అడ్డాల రూట్ సపరేటు !

"పురుషులందు పుణ్య పురుషులు వేరయా" అన్నట్లు.. దర్శకులందు శ్రీకాంత్ అడ్డాల రూట్ సపరేట్ అని చెప్పొచ్చు.. ఒక హిట్టు రాగానే.. రెండు మూడు సినిమాలకు అడ్వాన్సులు తీసేసుకొని నాలుగైదు ఫ్లాట్స్ తీసేసుకొని పండగ చేసుకుంటున్న దర్శకులున్న కాలంలో.. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వంటి సూపర్‌హిట్ తర్వాత కూడా.. తదుపరి చిత్రం విషయమై ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాడు.

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" విడుదలై ఆరు నెలలు కావస్తున్నా.. శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. స్వతహా శ్రీకాంత్ అడ్డాల అంతే. దర్శకుడిగా అతని తొలి చిత్రం "కొత్తబంగారు లోకం" ఘన విజయం సాధించినప్పటికీ.. రెండో చిత్రం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కోసం సుమారు అయిదేళ్లు నిరీక్షించాడు. చూస్తుంటె ఇప్పుడు మూడో చిత్రం కోసం కూడా అతను అంతే సమయం తీసుకునేట్లు ఉన్నాడు. నిజానికి.. శ్రీకాంత్ అడ్డాల మూడో చిత్రం.. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌తో ఉంటుందని ఆమధ్య వార్తలు వెలువడ్డాయి. కానీ.. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల స్థానంలో మరికొందరు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.