English | Telugu

ఇకపై రైటర్స్ మాత్రమే డైరెక్టర్స్ !

ఇంతకుముందు రైటర్స్ వేరుగా.. డైరెక్టర్స్ వేరుగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులొచ్చేసాయి. "కథ, కథనాలు ముఖ్యంకానీ.. డైరెక్షన్ ఏముంది" అనే పరిస్థితులొచ్చేసాయి. మంచి కెమెరామెన్‌ని తీసుకోవడంతోపాటు ఓ ఇద్దరు సీనియర్స్‌ను కో డైరెక్టర్స్‌గా పెట్టుకొంటే డైరెక్షన్ చేసేయొచ్చనే ధోరణి ఇప్పుడు నడుస్తోంది. తనకు కథ చెప్పడానికి వచ్చిన దశరధ్‌ను నాగార్జున డైరెక్టర్ని చేసేసినప్పట్నుంచి ఈ ట్రెండ్ మన టాలీవుడ్‌లో ఊపందుకుంది. దశరధ్‌ను స్ఫూర్తిగా తీసుకొని త్రివిక్రమ్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ తర్వాత మరికొందరు.

నిజానికి జంధ్యాల కాలం నుంచే రైటర్స్, డైరెక్టర్స్ కావడం అనేది అమల్లో ఉన్నప్పటికీ.. ఇప్పుడది పతాకస్థాయికి చేరింది. రైటర్స్ మాత్రమే డైరెక్టర్స్‌గా రాణించగలిగే రోజులు ముందు ముందు రానున్నాయి. మోనిటర్ ముందు కూర్చుని.. తను ఊహలోని సన్నివేశం స్క్రీన్‌పై ట్రాన్స్‌లేట్ అయ్యిందో లేదో చూసుకోగలిగే అవకాశం అందుబాటులోకి రావడంతో డైరెక్షన్ చాలా ఈజీ అయిపోయింది. పైగా కొంచెం లోతుగా పరిశీలిస్తే.. సినిమా రూపకల్పనకు సంబంధించిన ప్రతి విభాగానికి ఒక హెడ్ ఉంటాడు. డాన్స్‌లకు డాన్స్ మాస్టర్, ఫైట్స్‌కు ఫైట్ మాస్టర్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, మ్యూజిక్ వంటి అన్ని డిపార్ట్‌మెంట్స్‌కు హెడ్స్ ఉంటాడు. డైరెక్టర్ చెయ్యాల్సిందల్లా.. వీళ్లందరి దగ్గర్నుంచి మంచి అవుట్‌పుట్ తీసుకోవడమే. అందుకే.. డైరెక్షన్‌లో ఓనమాలు కూడా దిద్దుకోకుండానే ఇప్పుడు అనేకమంది డైరెక్ట్‌గా డైరెక్టర్స్ అయిపోతున్నారు!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.